Tags
Archana, ఉత్సవ్, Geeta Ganeshan, Hima Bindu, Manju, Mudra Academy, Sudhakar
శ్రీ ముద్ర అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్సు , హైదారాబాద్లోని నగరమందు యోగా మరియు నాట్యం వంటి కళా నైపుణ్యాలను విద్యార్థులులో పెంపొందించే విధంగా శ్రీ సుధాకర్ మరియు శ్రీమతి హిమబిందు లచే 2009 స్థాపించడం జరిగింది. సాంస్కృతిక సాంప్రదాయాల పట్ల మరియు భరత నాట్యం యోగ లో పిల్లలుకు శిక్షణ ఇవ్వడం జరుగుతోంది.
శ్రీ మతి హిమబిందు చెన్నై యందలి శ్రీ రుక్మిణీ దేవి అరుండేళ్ కళాక్షేత్ర నుండి శిక్షణ పొందియున్నారు. ఆ తరువాత హైదరాబాద్ యూనివర్సిటీ నుండి భరతనాట్యం ఎమ్.ఎ చేసి , తెలుగు యూనివర్సిటీ నుండి ఎమ్.ఫిల్ చేసి ప్రస్తుతం హైదరాబాద్
విశ్వవిద్యాలయం నందు పరిశోధక విద్యార్దిణి గా ఉన్నారు.
దేశ సాంస్కృతిక, సాంప్రదాయ నాగరికత అద్దం పట్టే విధంగా మరియు విద్యార్థులు కు కళల పట్ల అవగాహన తో పాటు అసక్తిని పెంపొందించేలా భరతనాట్యం మరియు యోగ వంటి అంశాల్లో నైపుణ్యాలు పెంపొందించడం ముద్ర అకాడమీ ముఖ్య ఉద్దేశం.
సంస్థ ఆశయ సాధనలో భాగంగా ప్రతి యేటా “ఉత్సవ్” అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. షుమారు 30 మంది విద్యార్థులు శ్రీమతి హిమబిందు ద్వారా శిక్షణ పొంది అడుగు మాల, అలరిపు, శబ్ధం, కీర్తనం, పదం, జావళీ, తిల్లాన వంటి నృత్య అంశాలు ప్రదర్శించడం జరిగింది. షుమారు 4సం!! నుండి 22 సం!! వయస్సు ఉన్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం రవీంద్ర భారతీ ఆడిటోరియం నందు 31/01/15 సాయంత్రం 6:30 ని!! కి ప్రారంభమైన కార్యక్రమం చిన్నారి అడుగులు తో మొదలై తిల్లాన తో చివరి వరకు ఆద్యంతం నాట్యం చేసి అబ్బురపరిచారు.
కార్యక్రమంలో ముఖ్య అతిధులగా శ్రీమతి వనిత భూపల్ మరియు శ్రీమతి గీతా గణేషన్ పాల్గొని విద్యార్థులు కార్యక్రమాన్ని తిలకించి విద్యార్థులు ఆశ్వీరదించడం జరిగింది. భరత నాట్యం పట్ల ఆసక్తి ని పెంపొందించే కార్యక్రమాన్ని మరియు ముద్ర అకాడమీ కృషిని ప్రశంసించారు. నాట్య గురువు శ్రీమతి హిమబిందు కార్యక్రమం నిర్వహించడం లో తమ భాద్యతను నిర్వర్తించడానికి నిర్విరామంగా కృషి చేశారు.
Lighting design : మురళీ బాసా